సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.