ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి పంచలేదనే కోపంతో ,,,తల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలో వదిలేసిన కూతుర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 07:46 PM

మాయమైపోయడమ్మ మనిషన్నవాడు అన్నది ఆచరణలో కనిపిస్తోంది. సమాజం ఎంత కమర్షియల్‌గా మారుతుందన్న దానికి తార్కాణమే సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో జరిగిన ఘటన. కుమారులు వంతులు పెట్టుకుని మరీ తండ్రిని చూసుకుంటుండటం ఇష్టం లేక.. ఓ వృద్ధుడు ఆత్మహుతి చేసుకున్న ఘటన అందరి హృదయాలను మెలిపెట్టింది. ఈ హృదయ విదారక ఘటన మరువక ముందే.. కామారెడ్డిలో ఓ తల్లికి వచ్చిన దుస్థితి మరింతగా కలచివేస్తోంది. కంటే కూతుర్నే కనాలి అని అందరూ చెప్తుంటే.. తనకు ముగ్గురు కూతుర్లున్నారని ఆ కన్నతల్లి ఎంత పొంగిపోయిందో.. చనిపోయిన తర్వాత ఆ అమ్మ అత్మ అంతకంటే ఎక్కువగానే ఘోషించి ఉంటుంది. ఆస్తి పంచివ్వలేదని.. కనీసం తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవ్వకుండానే చనిపోయిందన్న కోపంతో.. జన్మనిచ్చిన తల్లి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే అనాథగా వదిలేసి వెళ్లారు ముగ్గురు కూతుర్లు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌బీ నగర్‌కు చెందిన కిష్టవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ముగ్గురు కుమార్తెలున్నారు. అందులో ఓ కుమార్తె ఇటీవలే చనిపోయింది. అందరికీ పెళ్లిళ్లు కాగా.. వీళ్లందరూ కామారెడ్డిలోనే ఉంటున్నారు.


ఇదిలా ఉంటే.. కిష్టవ్వ పేరు మీద ఓ ఇల్లు ఉండగా.. బ్యాంక్ అకౌంట్లో సుమారు లక్షకు పైగా డబ్బులున్నాయి. అయితే.. వీటన్నింటికీ నామినీగా మాత్రం కిష్టవ్వ.. ఆమె కూతుర్ల పేర్లు కాకుండా.. దగ్గరి బంధువు పేరు పెట్టుకుంది. కాగా.. ఈమధ్య కిష్టవ్వ ఆరోగ్యం బాలేకపోవటంతో.. కుమార్తెలు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును తమకు ఇవ్వాలని కిష్టవ్వను అడిగారు. ఈ నేపథ్యంలోనే.. కిష్టవ్వ ఆరోగ్యం మరింత క్షీణించటంతో.. ఏప్రిల్ 21న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న కిష్టవ్వ.. శనివారం రాత్రి మృతి చెందింది.


కిష్టవ్వ మృతి చెందిన విషయాన్ని ఆస్పత్రి వాళ్లు ఆమె కుమార్తెలకు చెప్పారు. అయితే.. బతికి ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదన్న కోపంతో.. తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఇద్దరు కుమార్తెలు నిరాకరించారు. దీంతో.. ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిష్టవ్వ మృతదేహాన్ని మార్చురీలో పెట్టారు. ఇద్దరు కుమార్తెలున్నా.. చివరికి కిష్టవ్వ మృతదేహం అనాథగా ఆస్పత్రిలో ఉండటం చూసి.. పలువురిని కలచివేసింది.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com