ఓ చిన్నారి మాల్కు వెళ్లి... సరదాగా ఆడుతూ ఎంజాయి చేస్తుంది. అయితే.. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అక్కడున్న మిషన్లో పాప చేయి పడి మూడు చేతి వేళ్లు తెగిపోయాయి. ఈ విషాదకర ఘటన సంఘటన హైదరాబాద్ నడిబొడ్డులో చోటుచేసుకుంది. సెలవు రోజు కావటంతో.. తన మూడేళ్ల కూతుర్ని తీసుకుని బంజారాహిల్స్లోని సిటీ సెంటర్ మాల్కి వెళ్లాడు. మాల్లోని ప్లే జోన్లో ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా అక్కడే ఉన్న ఒక మిషన్లో పాప చేయి పడింది.
పాప గట్టి గట్టిగా కేకలు వేయటంతో వెంటనే స్పందించిన సిబ్బంది మిషన్ ఆఫ్ చేశారు. కానీ అప్పటికే ఆ చిన్నారి చేతి వేళ్లు చితికిపోయాయి. నొప్పితో విలవిల్లాడుతూ ఏడుస్తున్న చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వెంటనే స్పందించి.. చిన్నారికి సర్జరీ చేశారు. మూడు వేళ్లను తొలగించారు. దీంతో.. చిన్నారి చేతికి రెండు వేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఘటనతో.. చిన్నారికి రాసుకోటానికి గానీ.. తినడానికి గానీ.. వీలు లేకుండా మారిపోయింది. సరదాగా ఆడుకుంటుందని తీసుకొస్తే తమ కూతురికి ఇలా జరగిందని.. ఆ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు.
ప్లే జోన్లో సరైన రక్షణ ఏర్పాట్లు చేయని సిటీ మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆగ్రహం చెందిన బాలిక తండ్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. పిల్లలతో ప్లే జోన్లకు వెళ్లినప్పుడు గానీ.. లేదా బయటకు ఆడుకునేందుకు వెళ్లినప్పుడు గానీ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతం అజాగ్రత్తగా ఉన్నా.. ఇలాంటి విషాదకర ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదు. సో.. పేరెంట్స్ బీఅలర్ట్.