ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మురుగునీటితో మ్యాంగో కూల్‌డ్రింక్స్ తయారీ,,,కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టు రట్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 07:42 PM

కల్తీ, నకిలీ పదార్థాలను తయారుచేసి హైదరాబాద్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాలపై ఎస్‌ఓటీ పోలీసులు కన్నేశారు. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ముఠాలను పట్టుకుంటున్నారు. రోజూ మనం వాడే, తినే ప్రతీ పదార్థం, వస్తువులను కల్తీ చేస్తున్నారు. అంతేకాకుండా నకిలీవి కూడా తయారుచేస్తూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో ఇలాంటి ముఠాలు ఎక్కడికక్కడ ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పదార్థాలను తయారుచేస్తూ మార్కెట్లకు సరఫరా చేస్తోన్నారు. నిత్యావసర సరుకులను ఎక్కువగా కల్తీ చేస్తోన్నారు.


ఇటీవల కల్తీ ఐస్‌క్రీమ్‌లు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు, పదార్థాలను తయారుచేస్తున్న షాపులపై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్‌డ్రింక్ తయారుచేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో ఈ కల్తీ ముఠాను గుట్టు రట్టు చేశారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు మ్యాంగో కూల్‌డ్రింక్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. 500 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు లిటిల్ చాప్స్ పేరుతో ఉన్న మ్యాంగో డ్రింక్స్‌ను గుర్తించి సీజ్ చేసినట్లు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు స్పష్టం చేశారు. బాగా కుల్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్టు తయారు చేస్తున్నారని, అంతేకాకుండా అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా ఘాటుగా ఉండేందుకు అసిటిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు మిక్స్ చేస్తున్నట్లు గుర్తించారు.


వెల్లిపాయల పొట్టును కూడా ఈ కేటుగాళ్లు వదలడం లేదు. మెషినరీలో కుల్లి పోయిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పాయల పొట్టును సైతం కలుపుతూ పేస్ట్ తయారుచేస్తున్నట్లు ఎస్‌ఓటీ పోలీసులు చెబుతున్నారు. వీటిల్లో ప్రమాదకర రసాయనాలు కలపవడంతో పాటు మురుగు నీటి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అనుమతులు తీసుకోకుండానే అల్లం, వెల్లుల్లి పేస్టు పరిశ్రమను నడుపుతున్నారని, గత కొన్నేళ్లుగా ఈ కల్తీ దందా కొనసాగుతున్నట్లు చెప్పారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు ఆకర్షణీయమైన ప్యాకింగ్ వేసి మార్కెట్‌లో అమ్ముతున్నాని వివరించారు.


ఈ కల్తీ దందాపై ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆకస్మికంగా దాడులు చేపట్టి ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అలాగే 500 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్టు, మ్యాంగో కూల్‌డ్రింక్స్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వీరిని రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇవి తినడం వల్ల మనుషుల ఆరోగ్యాన్నికి ఎంతో ప్రమాదకరమని చెబుతున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com