తెలంగాణ ప్రభుత్వం మరోసారి చేపపిల్లలను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. 2023-24 సీజన్ లో 95.60 కోట్ల చేప, రొయ్య పిల్లలను 27 వేల నీటి వనరుల్లో వదిలేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికోసం రూ.107 కోట్లు వెచ్చిస్తోంది. టెండర్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుండి 31 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.