ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరుల ఆశయాలు నెరవేరడం లేదు: ప్రధాని మోదీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 02:01 PM

పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయంతో దిగిన ప్రధాని. అక్కడ భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొని మాట్లాడారు.


తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా...  వారి ఆశయాలు నెరవేర్చాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం భాజపా కార్యకర్తలు కృషి చేస్తున్నారు. భారతదేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఆశయాలు నెరవేరడం లేదు అని మోదీ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com