సదాశివపేట మండల పరిధిలోని నందికంది గ్రామంలో మామిడి తోటలో పేకాట స్థావరంపై బుధవారం సీఐ సంతోష్ కుమార్, ఎస్సై సుదర్శన్, పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుండి రూ. 1, 94, 559 నగదు, 15 స్మార్ట్ ఫోన్లు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు.