ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివాలయం శంఖుస్థాపనకు ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 10:51 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల 1వ తేదీన నూతనంగా నిర్మించనున్న శివాలయం శంఖుస్థాపనకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు, చంద్రయ్య, కిషోర్ కుమార్, వీరన్న, వెంకటేష్, రఘుపతి రెడ్డి, బీరప్ప, టీడీ రావు, సతీష్, శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com