కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల 1వ తేదీన నూతనంగా నిర్మించనున్న శివాలయం శంఖుస్థాపనకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు, చంద్రయ్య, కిషోర్ కుమార్, వీరన్న, వెంకటేష్, రఘుపతి రెడ్డి, బీరప్ప, టీడీ రావు, సతీష్, శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.