కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధికి చెందిన పంచశీల కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా పనులకు అవసరమైన వ్యయ ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రహీమ్, రమణారెడ్డి, నరేందర్, ప్రభాకర్, అశోక్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.