ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తా: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 02:08 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధికి చెందిన పంచశీల కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఆయా పనులకు అవసరమైన వ్యయ ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రహీమ్, రమణారెడ్డి, నరేందర్, ప్రభాకర్, అశోక్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com