కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంభీపూర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా తెరాస అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామరం పరిధిలోని ఒక్షిత్ హిల్ వ్యూ కాలనీ నూతనంగా ఎన్నికైన కాలనీ అధ్యక్షులు జగదీష్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని వివిధ సమస్యల మరియు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు, ఎమ్మెల్సీ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులుకు శుభాకాంక్షలు తెలిపారు, సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి , మంత్రి సత్యనారాయణ , కొలుకుల జగన్ , 125 డివిజన్ తెరాస అధ్యక్షులు విజయరాంరెడ్డి , సీనియర్ నాయకులు జిమ్మి దేవేందర్ , నూతన కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ రామానాయుడు , ట్రెసరర్ మోహన్ రావు , కాలనీ సభ్యులు సురేందర్ , కుమార్ , నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.