ఒకరితో ఒకరికి అసలు సంబంధమే లేని ఐదుగురు వ్యక్తులకు ఒకే సమస్య రావడం, దానికి పరిష్కారంగా వారి ముందు మూడు మార్గాలు ఉండడం, సమస్య నుండి తప్పించుకుని పారిపోవడం, సమస్య నుండి దాక్కోవడం, సమస్యపై పోరాడడం... ఈ మూడు విభిన్న మార్గాల ద్వారా ప్రయాణం సాగించిన ఐదుగురు వ్యక్తులు ఆఖరికి సమస్యను పరిష్కరించారా? ఎలా పరిష్కరించారు? ఆ సమస్యేంటి? ... అన్న ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో కొంచెంసేపటి క్రితమే దారి ట్రైలర్ విడుదలైంది.
పరమేశ్వర్ హీరవాల్, సునీత సద్గురు, కళ్యాణ్ విట్టపు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరాం కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి U. సుహాస్ బాబు డైరెక్టర్.
ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నరేష్ మామిళ్లపల్లి, మోహన్, రాజా కిషన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.