ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో లైగర్ ప్రమోషన్స్ .. పిక్స్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 01:18 PM

ఆగస్టు 25న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న "లైగర్" మూవీ ప్రమోషన్స్ నేటినుండి ముంబైలో మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం సెకండ్ లిరికల్ సాంగ్ "వాట్ లగా దేంగే" రిలీజైన నేపథ్యంలో, విజయ్, అనన్యా  ముంబై లోకల్ ట్రైన్ ఎక్కి హడావిడి చేసారు. సాధారణ జనాలలాగానే వెయిట్ చేసి, ట్రైన్ ఎక్కి, ట్రైన్ లోనే కొంచెంసేపు సేద తీరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది.బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com