నాగచైతన్య సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి నిధి అగర్వాల్. ఆపై కోలీవుడ్ లో బిజీగా మారి వరస సినిమాలను చేసింది. రామ్ పోతినేని హీరోగా చేసిన ఇష్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. తనకొస్తున్న సినిమా ఛాన్సుల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉండే నిధి, ఈ కారణంగానే ఎక్కువ సినిమాలను చెయ్యలేకపోయింది.
నిధి నటిస్తున్న కొత్త చిత్రం హరిహరవీరమల్లు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ఓటిటిలో అవకాశాలు వస్తున్నాయని, కానీ ఒక నాయికగా సినిమాకే తన మొదటి ప్రాధాన్యమని నిధి పేర్కొంది. ఇతర భాషలకన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఉండటమే తనకు సంతోషాన్నిస్తుంటుందని, తెలుగమ్మాయిని కావడమే అందుకు కారణమై ఉండొచ్చని నిధి తెలిపింది. "నేను చేసిన కొన్ని సినిమాలు నాకు గ్లామర్ పేరు తీసుకొచ్చాయి. కానీ నేను డీగ్లామర్ పాత్రలలో నటించడానికి కూడా రెడీనే” అని నిధి పేర్కొంది.