విడుదలకు ముందే టాలీవుడ్ ను ముఖ్యంగా నార్త్ ఇండియాను షేక్ చేస్తున్న చిత్రం అడవిశేష్ నటించిన మేజర్. 2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా, శశికిరణ్ తిక్కా మేజర్ చిత్రాన్ని రూపొందించారు. లీడ్ రోల్ లో అడవి శేష్ నటించటంతో పాటు ఈ చిత్రానికి రచయితగాను పనిచేసారు. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది.
చిత్రబృందం ఇదివరకు ప్రకటించిన ప్రకారమే, మేజర్ మూవీ విడుదలకు పది రోజుల ముందు నుండే స్పెషల్ ప్రీమియర్స్ ను ప్రదర్శిస్తుంది. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో మేజర్ ప్రీమియర్ జరిగింది. సినిమాను చూసిన EV ఆఫ్ 21 పారా స్పెషల్ ఫోర్స్ వెటరన్ కమాండో శివరాజ్ మేజర్ సినిమా పట్ల చాలా గర్వంగా ఉందని తెలిపారు. అలానే అక్కడి మిగిలిన ఆడియన్స్తో కలిసి జై హింద్ నినాదాలను పలికారు. శివరాజ్... 2002లో ఇండియా - పాకిస్తాన్ స్టాండాఫ్ కోల్డ్ మైన్ బ్లాస్ట్ లో తన రెండు కాళ్ళను పోగొట్టుకున్నారు. యుద్ధంలో వికలాంగుడిగా మిగిలిన శివరాజ్ మేజర్ మూవీని పొగడ్తలతో ముంచెత్తడంతో జూన్ 3నుండి బాక్సాఫీస్ సర్జికల్ స్ట్రైక్స్ తప్పదని క్లియర్ గా తెలుస్తుంది.