పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ "సర్కారు వారి పాట". ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులతో పాటు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈరోజు అత్యధిక థియేటర్లలో సినిమా విడుదలైంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు మంచి రెస్పాన్స్ మరియు టాక్తో ప్రారంభమైంది. దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అయితే, థియేటర్లలో సందడి చేయడంతో, సినిమాలో ఏ స్ట్రీమింగ్ కంపెనీ ఉంటుందో ధృవీకరించబడింది. ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులతో ప్రముఖ OTT కంపెనీ అయిన Amazon Prime వీడియోలో ప్రసారం చేయబడుతుంది. మరి అదెప్పుడు అనే ఇతర వివరాలు తర్వాత కన్ఫర్మ్ కానున్నాయి.