ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ కార్యకలాపాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:09 AM

అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 11.30 గంటల నుండి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ నుండి వస్తున్న శాసన సభ సిబ్బందికి సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు స్వ యంగా స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుండి వీడ్కోలు తీసుకున్న సభాపతి కోడెల సోమవారం నుంచి పూర్తి స్థాయి బాధ్యతలను వెలగపూడి నుండి నిర్వహిస్తారని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావు తెలిపారు.  మరోవైపు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణు డు కూడా నూతన అసెంబ్లీ భవనం నుండి తన విధులలో నిమగ్నం కాను న్నా రు. శాసన సభ నుండి ఏపీకి సంభందించిన సామా గ్రిని తరలించగా, సిబ్బం దికి అవసరమైన తాత్కాలిక వసతి ఏర్పాట్లను శాసన సభ కార్యదర్శి స్వయం గా పర్యవేక్షిస్తున్నారు. ఆరవతేది నుండి అసెంబ్లీ సమా వేశాలు ప్రారంభం కా నున్న నేపథ్యంలో సిబ్బంది కొరతను కొంత మేర అధి కమించేలా ఏర్పాట్లు చేశారు. సమావేశాల నేపథ్యంలో వారిని రిలీవ్‌ చేయ కుండా బడ్జెట్‌ సమావే ేశాలు పూర్తయ్యేంత వరకు కొనసాగించాలని సత్య నారాయణరావు అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com