ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లోకి మూడేళ్ల పాక్ బాలుడు

international |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:06 AM

పాకిస్థాన్ నుంచి మన దేశ సరిహద్దులోకి ఈ సారి మూడేళ్ల  బాలుడు వచ్చాడు. భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు పట్టుకుని... పాక్ సైన్యానికి అప్పగించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో మూడేళ్ల బాలుడు పాకిస్థాన్ నుంచి సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి వచ్చాడు. కంచె దగ్గర ఏడుస్తూ నిలబడి ఉన్న పిల్లవాడిని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సైనికులు గమనించారు.


సైనికులు ఆ బాలుడిని వివరాలు అడిగారు. కానీ ఏమి చెప్పలేకపోయాడు. బాలుడిని వారి దగ్గరే ఉంచుకున్నారు. బీఎస్‌ఎఫ్ ఫీల్డ్ కమాండర్ వెంటనే పాకిస్థాన్ రేంజర్స్‌ను సంప్రదించారు. విషయం వారికి చెప్పి.. రాత్రి 9.45 గంటల సమయంలో ఆ బాలుడిని మానవతా దృక్పథంతో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా, తెలిసి తెలియకుండా సరిహద్దు దాటే వారి పట్ల ఆర్మీ మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com