ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదరికంతో పసిపాప అమ్మకానికి...పోలీసుల రంగ ప్రవేశంతో సీన్ రివర్స్

national |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:06 AM

పేదరికం ఏదైనా చేయిస్తుంది అంటారు. ఇలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. జాజ్‌పూర్ జిల్లాలో పేదరికం కారణంగా తల్లిదండ్రులు పసిపిల్లను విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పాపాయిని రక్షించారు. చంపేపాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బరీనా గ్రామంలో ఇద్దరు దంపతులు పోషించే స్థోమత లేక తమ ఒకటిన్నర నెలకు చిన్నారిని రూ.7000లకు అమ్మేశారు. దీనిపై దస్రత్‌పూర్ బ్లాక్‌లో అంగన్‌వాడీ వర్కర్, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పాపను రక్షించారు.


అయితే ఒడిశాలో ఇలా పసిపిల్లలను విక్రయించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. అక్కడ అత్యంత పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలు వారికి పుట్టిన పిల్లలను పోషించలేక అమ్మేస్తున్నాయి. పశ్చిమ ఒడిశా జిల్లాలు కలహండి, బోలంగీర్‌‌లలో పిల్లల విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. పిల్లల విక్రయాల కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి.


ఇదిలావుంటే తల్లిదండ్రులతో పాటు పిల్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన జంటపై ఐపీసీలోని సెక్షన్ 317, జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 81 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. "పాప తల్లిదండ్రులు గత నెలలో పాపను విక్రయించారు. దీని గురించి స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు.. శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారికి తెలియజేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. శిశువు తల్లిదండ్రులు రోజువారీ కూలీలు.. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలను కలిగి ఉన్నారు. పేదరికం కారణంగా వారు మూడో బిడ్డను విక్రయించారు." అని జిల్లా బాలల సంరక్షణ అధికారి నిరంజన్ కర్ చెప్పారు. ఆ శిశువును రక్షించి.. ఆమె సహజ తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com