ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో మళ్లీ కలకలం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 17, 2017, 12:09 PM

దివంగత జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో మళ్లీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ, కొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 12.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట్ లోని ఎ సైకోథెరపీ సెంటర్ లో డబ్బులు దాచారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో కొందరికి డబ్బు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది శశికళ బంధువు దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఏప్రిల్ 12నే జరగాల్సి ఉంది. భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరిగిన నేపథ్యంలో, అప్పుడు ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే నెలకొనడం గమనార్హం. డిసెంబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com