ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్యాకేజీల కోసమే జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 01:59 PM

ప్యాకేజీల కోసమే జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ జగన్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈరోజిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… పవన్‌ చెప్పడం వల్లే కాపులు టీడీపీ, బీజేపీకి ఓట్లేశారన్నారు. పవన్‌కు స్క్రిప్టులు రాసే వ్యక్తికి అవగాహన లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ గజినీలా అన్ని మర్చిపోవడం కాదు.. ఎన్నికల సభలో మోడీ, బాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్యాకేజీలు తీసుకునే వాళ్లకి ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పదవుల కోసమే పార్టీలు పెడతారని, లేదంటే పవన్‌ కల్యాణ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ పెట్టుకోవచ్చన్నారు.ప్రభుత్వ పథకాలకు ప్రజల మన్ననలు పొందిన నేతల పేర్లు పెట్టాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు.  21 పథకాలకు చంద్రబాబు తన పేర్లు పెట్టుకున్నారన్నారు. ఖర్జూరనాయుడు ఆస్తులమ్మి పథకాలు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. ఆస్తులు పెంచుకోవాలని చూస్తే తరిమి కొడతామన్నారు. హెరిటేజ్‌ లాభాల కోసం పదవి అడ్డు పెట్టుకుంటున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com