ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. మంత్రులు దేవినేని, ఎంపీ మాగంటి బాబు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పోవలం ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రం వాల్, స్పిల్వే, దిగువ కాఫర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించనున్నారు.