ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యార్ చేసిన నీచ్ వ్యాఖ్యలపై బీఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరోసారి ఫైర్ అయ్యారు. మణిశంకర్ అయ్యర్ ను కాంగ్రెస్ నుంచి సస్పెంచ్ చేయడం సరిపోదని పేర్కొన్నారు. ఆయనను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాలని ములాయం అన్నారు. రాజకీయాలలో బురద జల్లడం అన్నది ఒక ఆనవాయితీగా మారిపోయిందని ములాయం అన్నారు. విభేదాలు సిద్ధాంత పరంగా ఉండాలే తప్ప పరస్పర దూషణలకు దిగడం, అనుచిత వ్యాఖ్యలతో విమర్శలకు తెగబడటం తగదని ములాయం పేర్కొన్నారు.