అహ్మదాబాద్ : వలసల కారణంగా ఉపాధి, ఆవాసాలను కోల్పోయిన గిరిజనులను ఆదుకోవడం కోసం మీరు ప్రకటించిన వన బంధు కల్యాణ్ యోజన పథకం ఏమైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి మరో ప్రశ్న సంధించారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం ప్రధాని నరేంద్రమోడీ రూ.55 కోట్లతో ప్రకటించిన వనబంధు కల్యాణ్ యోజన పథకాన్ని అటకెక్కించేశారని విమర్శించారు. గిరిజనుల భూములను లాగేసుకున్నారు. దీంతో వారు స్కూళ్లు, ఆసుపత్రులు వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచకుండా పోయారని విమర్శించారు.