విజయవాడ: నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని సమస్యలు చెబితే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో భేటీ అయిన పవన్ మాట్లాడారు. ప్రతిపక్షం అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలంటే బీజేపీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అసెంబ్లీకి ప్రతిపక్షం హాజరుకాకపోవడం తప్పేనని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షమే నిలదీయాలని పవన్ పేర్కొన్నారు. శ్రమ దోపిడికి నేను వ్యతిరేకమని, కష్టపడ్డ వారికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకునే వాడినని అన్నారు. కార్మికుల చట్టాలను తుంగలో తొక్కుతున్నారని పవన్ ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.