డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించిన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేడిక్కడ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ కేంద్రం సామాజిక, ఆర్థిక రూపాంతర కేంద్రంగా, అతి పెద్ద పరిశోధనా కేంద్రంగా పని చేస్తుందని ఆయన అన్నారు. జాతి నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన పాత్ర మరువలేనిదని ప్రధాని మోడీ అన్నారు. అయితే అంబేద్కర్ చేసిన కృషిని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నాలు జరిగాయని, అవన్నీ విఫలమయ్యాయని ఆయన అన్నారు. అంబేద్కర్ ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మోడీ చెప్పారు.