మహిళా సాధికారతకు అడ్రస్గా తెలుగుదేశం ప్రభుత్వం మారిందని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మహిళా సాధికారత అంశంపై ఆమె మాట్లాడుతూ మన సమాజం మహిళలకు అత్యున్నత గౌరవమిస్తుందన్నారు. 2000 సంవత్సరాల క్రితమే శాతకర్ణి తన పేరు ముందు తల్లి పేరు పెట్టుకొని గౌతమీపుత్ర శాతకర్ణిగా మహిళలకు ఎంతటి గౌరవం ఉందో చాటి చెప్పారన్నారు. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. విద్య, ఆరోగ్యం, రాజకీయాలు, న్యాయ రంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను మరింత ప్రోత్సహిస్తున్నారన్నారు. బాలికల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.