కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఆస్పరి మండలం కారుమంచి నుంచి ప్రారంభించిన జగన్ పాదయాత్ర వెంగళరాయదొడ్డి మీదుగా కైరుప్పల వరకు చేరుకుంది. కారుమంచి గ్రామంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్రలో ఉన్న జగన్ను కారుమంచి గ్రామ మహిళలు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత హయాం నాటి చదువుల విప్లవాన్ని మళ్లిd తీసుకొస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. పిల్లలను బడులకు పంపితే ఏటా రూ.15వేలు ఇస్తానని, పిల్లల కాలేజీ ఫీజులు ఎంతైనా భరిస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు.