రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా సరిహద్దు బొప్పూడి గ్రామం వద్ద మంత్రి మంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, కదిరి బాబురావు, స్వామితోపాటు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరారు.