ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ పాదయాత్ర 6వ తేదీకి వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 24, 2017, 11:43 AM

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించతలపెట్టిన పాదయాత్ర తేదీని మార్పు చేశారు. తొలుత నవంబర్ 2వతేదీ నుంచి పాదయాత్ర నిర్వహించాలని అనుకున్నప్పటికీ సీబీఐ కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చిన నేపధ్యంలో 2వతేదీ నుంచి 6వ తేదీకి వాయిదా వేశారు. వచ్చే నెల 3వతేదీ సాయంత్రం తిరుమలకు జగన్ చేరుకుంటారు. అనంతరం 4వతేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే 5వతేదీన కడప పట్టణంలోగల దర్గాను దర్శిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకుని చర్చిలో ప్రార్ధనలు చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com