అమరావతి: రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఒహియో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జాన్ క్యారీతో ఆయన భేటీ అయ్యారు. ఒహియో రాష్ట్రంలో ఏపీ విద్యార్థులకు ఫీజు రాయితీపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అలాగే గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తుది ఎంవోయూను సిద్ధం చేశారు. అనంతరం ఎంవోయూలపై ఇరువురు మంత్రులు సంతకాలు చేశారు. దీనివల్ల ఒహియో వర్సిటీల్లో చదివిన ప్రతి విద్యార్థికి రూ.10లక్షల వరకు లబ్ది చేకూరనుంది. అమెరికన్ అకడమిక్ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ ఎంవోయూ అమల్లోకి వస్తుంది. కాగా... ప్రతి ఏడు ఒహియోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3-4వేల మంది విద్యార్థుల వలస వెళుతున్నారు. బ్యాచులర్, ఎంఎస్ నుంచి మెడికల్, ఇంజినీరింగ్ అన్నికోర్సులకు ఫీజు రాయితీ వర్తిస్తుందని మంత్రి గంటా తెలిపారు.