ప్రజల ప్రాణలకంటే సీఎం భజనే ప్రభుత్వానికి ఎక్కువైంది. జే బ్రాండ్ మద్యం, నాటుసారా స్లో పాయిజన్ లా ప్రజలపై ప్రభావం చూపుతోంది. నాటుసారాతో అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారు, జే బ్రాండ్ మద్యం పీడ విరగడవ్వాలి! . ప్రజలకు మేలు చెయ్యండి , కల్తీ సారా పీడా వదిలించండి అని మోర పెట్టుకుంటుంటే , ప్రజల తరపున ప్రతిపక్షాల మాటలు వినాల్సింది పోయి , అడగటమే నేరంగా భావించి మమ్మల్ని బయటకి పంపడం మా మీద సస్పెన్షన్ వేటు వెయ్యడం ఎంత వరకు సబబు అని టీడీపీ నాయకులూ అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.