ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వస్తువుల ధరలకు ఇకపై రెక్కలు

international |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 04:21 PM

కరోనా వేవ్ లకు ఇక భారతీయులు భయపడాల్సిన అవసరంలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరిగిపోతున్నాయి. దీని వల్ల సామాన్యులపై మరోసారి ప్రభావం పడబోతోంది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు పైకి చేరనున్నాయి. కరోనా వైరస్ దెబ్బకి చైనాలో మళ్లీ పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. చైనా టెక్ హబ్ షెన్‌జెన్‌లో కూడా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. అక్కడ కూడా లాక్ డౌన్ ఉంది. దీని వల్ల రానున్న కాలంలో టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ‌ఫోన్స్ ధరలు పెరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ సరఫరా నగరాల్లో ఇది కూడా ఒకటి. అందుకే ధరలపై ప్రభావం పడనుంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రీసెర్చ్ డైరెక్టర్ నవ్కేంద్ర సింగ్ మాట్లాడుతూ.. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో చైనాలోని షెన్‌‌జెన్‌ నుంచి 20 నుంచి 50 శాతం వరకు ఉన్నాయి. కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ కొనసాగింపు వంటివి చోటుచేసుకుంటే.. కచ్చితంగా ధరలు పెరగొచ్చని వివరించారు. దీని వల్ల వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. షెన్‌జెన్‌లో లాక్ డౌన్ మూడు వారాలు దాటితే అప్పుడు మన దేశంలోకి జూన్ త్రైమాసికపు స్మార్ట్‌ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్స్ దిగుమతులపై ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌పై కూడా ఈ ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ కొనసాగితే.. ధరలు పెరుగుతాయని, స్మార్ట్‌ఫోన్స్ ధరలు 5 నుంచి 7 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. ఇప్పటికే ముడి పదార్ధాల ధరలు పెరుగుదల వల్ల కంపెనీలపై ఒత్తిడి నెలకొంది. దీనికితోడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో కంపెనీలపై మరింత ప్రభావం పడుతోంది. ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తే మాత్రం కంపెనీలు కచ్చితంగా ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయొచ్చు. దీని వల్ల కస్టమర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల కూడా టీవీల తయారీలో వాడే పలు విడి భాగాల ధరలు పైకి కదిలాయని వీడియో‌టెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు. అందువల్ల రానున్న కాలంలో టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్స్ ధరలు పైకి చేరొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com