గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఉదయగిరి డిపోలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. డిపో సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కావలి పట్టణానికి చెందిన సిహెచ్. ప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా ఉదయగిరి డిపోలో (ఎడిసి) గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో తన విధి నిర్వహణలో భాగంగా ఆదివారం డిపోలో విధులు నిర్వర్తించి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లోకి వెళ్లి తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఆయన స్థానంలో సోమవారం విధుల్లోకి వచ్చిన మరో ఎడిసి ప్రసాద్ కనిపించకపోవడంతో మరుగుదొడ్డి లోకి వెళ్లి చూడగా అక్కడ ఆయన కుప్పకూలి పడి ఉన్నాడు. దీంతో కార్మికులు హుటాహుటిన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన ప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణవార్త తెలుసుకున్న భార్య, బిడ్డలు ఉదయగిరి చేరుకొని మృతదేహాన్ని స్వగ్రామమైన కావలికి తీసుకు వెళ్లారు. ఏడిసి ప్రసాద్ మృతి పట్ల డిపో మేనేజర్ ప్రతాప్ కుమార్, ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు సంతాపం తెలిపారు.