హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితో ఆ పార్టీ ముఖ్యనేతలు సోమవారం లోటస్పాండ్లో సమావేశమయ్యారు. కోర్టు తీర్పు, భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాలు, పాదయాత్ర తీరుపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో టీడీపీ అనుబంధ సభ్యులు ఎవరున్నారనే దానిపై జగన్ ఆరా తీసినట్లు సమాచారం. వైసీపీ అంతర్గత సమాచారం టీడీపీకి చేరుతుందని జగన్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.