ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా .. తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 10:03 AM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం జరగనుంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు రోజూ రూ.30 లక్షల దాకా ఖర్చవుతుంది.ఏటా దేవాన్ష్‌ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే వ్యయం రూ. 30లక్షలను విరాళంగా ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీకి చంద్రబాబు కుటుంబం కోరింది. దీంతో సోమవారం తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో టుడే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com