వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు మూతపడనున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో వరుసగా నాలుగో శనివారం, ఆదివారం కారణంగా సెలవులు వర్చాయి. ఇక 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న బ్యాంకింగ్ రంగంలో చర్యలపై బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AICBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) దేశ వ్యాప్త సమ్మెపై గతంలోనే ప్రకటన చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె, సాధారణ సెలవులతో కలిపి మార్చి 26 నుంచి 29 వరకు మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్ లావాదేవీలను ప్రజలు ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.