తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1 నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయించిన టీటీడీ..టికెట్లను విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల టికెట్లను వెబ్సైటులో ఉంచగా.. కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత భక్తులకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో సుప్రభాతం, తోమాల, అర్చన, నిజపాద దర్శనం టికెట్లను కేటాయించనుండగా.. ఈ నెల 22న టికెట్లు పొందిన వారి జాబితాను ప్రకటిస్తారు.