నెల్లూరు: తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్ర నుండి తమిళనాడు కి తరలిపోతున్న గంజాయిని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సిఐ ఆర్ యువీఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా నెల్లూరు నుండి చెన్నైకు వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ డిపో బస్సులో ఒరిస్సా రాష్ట్రం సోలాపూర్ జిల్లా, బనకాపల్లి మండలం, కంద్రగల్లు గ్రామానికి చెందిన పంకజ్ బిబార్, జుగేస్తి సాహు అనే ఇద్దరు వ్యక్తుల నుండి 11 కేజీల గంజాయి తో పాటు ఇద్దరు నిందితులని అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఎస్ఐ. ఓ ప్రతాప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ఎన్ రసూల్, కానిస్టేబుల్ పి. వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు, ప్రభాకర్లు ఉన్నారు.