జగనన్న విద్యాదీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు మంచి చేస్తూ రూ. 709 కోట్లు విడుదల చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ మూడేళ్ళలో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్ పై గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కలుపుకుని మొత్తం రూ.9,274 కోట్లు ఖర్చు చేశాం. అని సీఎం జగన్ తెలిపారు.