దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్ లు తెచ్చాం. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలనే ఆలోచనే రాకుండా చేస్తాం,ఏదైనా సంఘటన జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు జగన్ రెడ్డి.కానీ మహిళా దినోత్సవం రోజున నెల్లూరులో ఒక విదేశీ యువతిపై వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త రేప్ చేయబోతే ఒక రైతు అడ్డుకొని విదేశీ యువతికి అండగా నిలబడ్డాడు. కానీ ఆ రైతును విచారణ పేరిట వైసీపీ కండువా కప్పుకున్న పోలీస్ లు వేదించడం దుర్మార్గం. నిందితుడిని అరెస్ట్ చేయడం శిక్షించడం చేయక దేశ పరువు రాష్ట్ర పరువు కాపాడిన రైతును సత్కరించాల్సిందిపోయి ఇలా వేధించడం చూస్తుంటే రాజారెడ్డి రాజ్యాంగంలో ఇంతకంటే ఇంకేమి ఆశించగలం అని నెల్లూరు టీడీపీ నాయకులూ మరియు సీనియర్ టీడీపీ నాయకులూ అయ్యన్న పాత్రుడు తెలిపారు.