వేసవి కాలంలో రైళ్లలో నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గుంతకల్లు రైల్వే ఎస్పీ, గుంటూరు ఇన్ఛార్జి ఎస్పీ పి. అనిల్బాబు తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కేసులు తగ్గడం, రైళ్ల సంఖ్య పెంచడంతో ప్రయాణికులు పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో నేరాల కట్టడి, ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
జీఆర్పీ, ఆర్పీఎస్ సిబ్బంది సహకారంతో వేసవిలో చోరీలు జరగకుండా రైళ్లలో ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేయనునట్లు తెలిపారు. అవసరమైతే సాధారణ పోలీసుస్టేషన్ల నుంచి సిబ్బందిని కోరతామని చెప్పారు. పాత నేరస్థుల ముఖ కవళికలు, వారి వివరాలు పొందుపరచిన ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ పరికరాలను త్వరలో గుంటూరు, ప్రధాన రైల్వేస్టేషన్లలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. జీఆర్పీ ఏఎస్పీ అజయ్ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు డివిజన్ పరిధిలో చోరీకి గురైన సొత్తు రికవరీ శాతం పెరిగిందని తెలిపారు. 2020లో 40 శాతం ఉండగా 2021లో 44 శాతం, 2022లో 99 శాతం రికవరీ చేసినట్లు చెప్పారు.