చిత్తూరు: కొవిడ్ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. నాడు - నేడు ద్వారా కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడటం, మధ్యాహ్నం భోజనం బాగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019-20లో ప్రభుత్వ పాఠశాలల్లో 3, 43, 683- ప్రైవేట్ పాఠశాల్లో 2, 35, 506 మంది చదివారు. 2020-21 లో ప్రభుత్వ పాఠశాలల్లో 3, 82, 951 మంది , ప్రైవేట్ పాఠశాల్లో 1, 94, 263 మంది ఉన్నారు.