తిరుపతిలోని అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద ఉద్యోగులు , సిబ్బంది , స్థానికుల సౌకర్యార్థం రూ. 60 లక్షల వ్యయంతో నూతనంగా షెడ్డు ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్ తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అలిపిరిలో షెడ్డు ఏర్పాటుకు పరిశీలన చేశారు. వెయ్యి ద్విచక్ర వాహనాలు నిలిపేలా జూన్ లోపు అలిపిరిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.