ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్రలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2017, 12:27 PM

అమరావతి: చరిత్రలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నాలుగో జాతీయ జలరవాణా మార్గానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో రూ. 96 కోట్లతో తొలిదశ జల రవాణా పనులు నిర్వహిస్తున్నామని, కొత్తగా 1890 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరగనుందన్నారు. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలను కలపాలంటే ఏపీ కీలకమని, విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి వెంకయ్యనాయుడు అండగా నిలిచారని చంద్రబాబు అన్నారు. అలాగే మూడు దశల్లో జాతీయ జలరవాణా మార్గం పనులు జరుగుతాయని, ముక్త్యాల-విజయవాడ మధ్య తొలి దశ, రెండో దశలో కాకినాడ-విజయవాడ మధ్య పనులు జరుగుతాయన్నారు. అలాగే మూడో దశలో విజయవాడ-పుదుచ్చేరి మధ్య పనులు జరుగతాయని, అలాగే సరుకు రవాణా, ప్రయాణికుల టెర్మినల్స్‌ నిర్మాణం జరగనుందన్నారు. నితన్ గడ్కరీ ఏపని మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరని, ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వాణిజ్యపరంగా ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com