నాలుగో జాతీయ జలరవాణా మార్గానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విజయవాడలో మంగళవారం ఉదయం వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే ఏడు హైవేల విస్తరణ, అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించారు. రూ. 7015 కోట్లతో 315 కి.మీ జాతీయ జలరవాణా ప్రాజెక్ట్లకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ముక్త్యాల-విజయవాడ మధ్య తొలి దశ పనులకు వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.