విజయవాడ గాయత్రినగర్ ఎస్బీఐ బ్రాంచ్లో హెడ్ క్లర్క్ కృష్ణచైతన్య చేతివాటం తాకట్టు పెట్టిన 10.5 కిలోల బంగారాన్ని చోరి చేశాడు. ఈ చోరి చేసిన బంగారాన్ని మణప్పురం బ్రాంచ్లో కృష్ణ చైతన్య తనఖా పెట్టి వచ్చిన డబ్బులను షేర్లల్లో పెట్టాడని తేలిపోయింది. దీంతో ఎస్బీఐ ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకోని పోలీసులు సీఐడీకి అప్పగించినట్లు సమాచారం. కృష్ణ చైతన్యతో పాటు మణప్పురం సిబ్బంది ఫణికుమార్, దిలీప్పై కేసు నమోదు చేశారు.