ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాకి కింద పడటంతో మిస్ ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2017, 05:44 PM

అనంతపురం రైల్వే స్టేషన్ లో తుపాకి  మిస్ ఫైర్ అయింది. ప్రమాదవశాత్తు  రైల్వే ప్రోటెక్షన్ ఫోర్సు జవాను చేతిలో  ఉన్న  తుపాకి పేలింది. ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే హడావుడి లో  ప్లాటుఫామ్ పై ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు తగిలి చేతిలో ఉన్న తుపాకి కింద పడటంతో  మిస్ ఫైర్ జరిగింది. దీంతో గుంతకల్లు కు చెందిన  హెడ్ కానిస్టేబుళ్లు రఫీ, రామచంద్రప్పల కాళ్ల లోకి బుల్లెట్లు దూసుకెళ్ళాయి. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్లను  అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు.  విషయం తెలుసుకున్న గుంతకల్లు ఆర్పీఎఫ్ కమాండెంట్ ఎలీషా ఘటనా స్థలాన్ని సందర్శించి చికిత్స పొందుతున్నకానిస్టేబుళ్లను పరామర్శించారు. ఎలీషా సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కానిస్టేబుళ్లను కర్నూలు ఆసుపత్రికి తలించారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com