ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. హైదరాబాద్లోని కుంట్లూరుకు చెందిన శివ కాంత్ రెడ్డి, కడపకి చెందిన అశోక్ కుమార్ మారుగుత్తిలు ఉక్రెయిన్లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో చదుతున్నారు. శివకాంత్రెడ్డి, అశోక్ కుమార్లు స్నేహితులతో కలిసి బీచ్లో వాలీ బాల్ ఆడుతుండగా బాల్ సముద్రంలో పడింది. బాల్ తీసుకురావడానికి వెళ్లిన ముఖేష్ అనే మిత్రున్ని రాకాసి అలలు సముద్రంలోకి లాక్కెల్లాయి. అతడిని కాపాడటానికి వెళ్లి, అతన్ని రక్షించి శివకాంత్రెడ్డి, అశోక్ కుమార్లు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ నెల ఒకటవ తేదీన సెలవులు ముగియడంతో శివ కాంత్ రెడ్డి తిరిగి ఉక్రెయిన్ వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.