ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి కోసం హింసిస్తున్నారని ఓ తండ్రి ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 04:26 PM

ఆస్తి కోసం ఇద్దరు కుమారులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారి నుంచి కాపాడాలని ఓ తండ్రి ఉస్మాన్ జానీ స్పందన కార్యక్రమంలో జిల్లా ఏఎస్పి ని వేడుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో పడారుపల్లి మాస్టర్స్ కాలనీకి చెందిన సయ్యద్ ఉస్మాన్ జానీ పోలీసు అధికారులను కలిశారు.


జిల్లా అదనపు ఎస్పీ వెంకట రత్నంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సయ్యద్ షాకత్, సాజిర్, షకీల్, షహమీర్ కుమారులున్నారని, తన భార్య సయ్యద్ ఫాతిమాబీ మరణానంతరం వారు ఆస్తి కోసం తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారితో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తండ్రి ఆవేదన చూసి స్పందించిన అదనపు ఎస్పీ వెంటనే వేదాయపాళెం పోలీసులతో ఫోనులో మాట్లాడారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com