ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జై షా.

sports |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 10:08 PM

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన అనంతరం భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి స్టార్ ప్లేయర్ల ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. గెలిచిన సంతోషంగా ఉండాలా? తమ ఆరాధ్య క్రికెటర్లు మళ్లీ అంతర్జాతీయ టీ20ల్లో కన్పించరని బాధ పడుతున్నారు. మరికొందరైతే.. వాళ్లు మెళ్లి మెళ్లిగా అంతర్జాతీయ క్రికెట్ మొత్తానికి దూరమైతారనే ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ బీసీసీఐ కార్యదర్శి జై షా గుడ్ న్యూస్ చెప్పారు.


పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025, లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో కోహ్లీ, రోహిత్‌లు పాల్గొంటారని జై షా వెల్లడించారు. ఈ మేరకు అందుకు అనుగుణంగా టీమిండియా ప్రణాళికలు రచిస్తుందని.. ఆ దిశగా అడుగులు వేస్తోందని చెప్పుకొచ్చారు. సీనియర్ ఆటగాళ్లపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. జై షా వ్యాఖ్య నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు మరో రెండు ఐసీసీ టోర్నీలు ఆడతారని వెల్లడైంది.


ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ నియామకంపై కూడా ఆయన స్పందించారు. శ్రీలంకతో సిరీస్‌ నుంచి భారత్‌కు కొత్త కోచ్ వస్తారని చెప్పుకొచ్చారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న జింబాబ్వే సిరీస్ కోసం వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ సెలక్టర్‌గా ఉంటాడని జై షా వివరించారు. క్రికెట్ సలహా కమిటీ ఇప్పటికే గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్‌ పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. వారి సూచన మేరకు కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సెలక్టర్ల నియామకంపై కూడా దృష్టి సారించినట్లు జై షా వెల్లడించారు. ఇక టీమిండియా టీ20 కెప్టెన్ ఎవరు అనేదానిపై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని జై షా ప్రకటించారు.


"భారత సీనియర్ల జట్ట ప్రదర్శన అద్భుతంగా ఉంది. టీమిండియా తర్వాతి లక్ష్యం ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-2025) ఫైనల్స్‌ గెలవడమే. దాదాపుగా టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేసిన జట్టే ఈ రెండు టోర్నీల్లోనూ ఆడుతుంది. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే మన లక్ష్యం. దేశంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. పెద్ద సంఖ్యలో రిజర్వ్ ప్లేయర్లు ఉన్నారు. అవసరం అనుకుంటే మనం ఒకేసారి 3 టీమ్‌లను ఎంపిక చేయగలం" అని జై షా చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com